కొద్ది రోజుల క్రిందట జరిగిన KSCCL సమావేశంలొ 2 కీలక విషయాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలు..
భవనాల పైకప్పులపై సోలార్ పలకల ద్వారా 5MW తయారీకి ప్రణాళిక:
Kakinada Smart City Corporation Limited(KSCCL) వివిధ ప్రభుత్వ విభాగ భవనాల పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ద్వారా 5 MW సోలార్ పవర్ను ఉత్పత్తి చేయటానికి చర్యలు చేపట్టింది. కొద్దిరోజుల క్రిందట జిల్లా కలెక్టర్ కార్తికాయ మిశ్రా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ ప్రాజెక్టు కోసం KSCCL ఈ మేరకు చర్చించింది.
విద్యుత్ కొనుగోలు ఒప్పందం Power Purchase Agreement (PPA) ద్వారా ఇప్పటికే 1.2 మెగావాట్ల ఉత్పత్తికి, PPAs ద్వారా మరో 0.82 మెగావాట్ల సిద్ధంగా ఉంది. వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులతో మాట్లాడి, ఆయా భవనాల పైకప్పు ప్రదేశంలో సోలార్ పానెల్స్ ను నిర్మించేలా చూడాలి అని కలెక్టర్ వారికి సూచించారు.
మురికినీటి శుద్ధి కర్మాగారం:
కాకినాడ స్మార్ట్ సిటీ పనులు కింద 10.46 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మురుగునీటి శుద్ధి ప్లాంటు కోసం భూమిని గుర్తించాలని ఆయన అధికారులను ఆదేశించారు. వివిధ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులను అమలు చేయడానికి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Comments